byసూర్య | Wed, Apr 17, 2024, 01:41 PM
మరికల్ మండలం మద్వర్ గ్రామంలోని ఎస్సి కాలనిలో త్రాగు నీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథ నీరు మూడు రోజులకు ఒక సారి మాత్రమే వస్తున్నాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కావాలంటే ట్యాంకర్ ను ఆశ్రయించాలని అంటున్నారు. గ్రామం మొత్తంలో ప్రతి రోజు నీళ్లు వస్తున్న ఎస్సి కాలానికి మాత్రమే మూడు రోజులకు ఒక సారి వస్తున్నాయని, అధికారులను ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.