byసూర్య | Wed, Apr 17, 2024, 01:39 PM
ఉపాధిహామీ కూలీలకు 200 దినాల పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. బుధవారం నారాయణపేట మండలం ఊటకుంట తాండ చెరువులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ. పెండింగ్లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రాంతాల్లో కూలీలకు మౌలిక సదుపాయాలు త్రాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.