కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి

byసూర్య | Mon, Apr 29, 2024, 09:04 PM

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు గుడ్‌బై చెప్పగా.. తాజాగా మరో యువ నేత పార్టీని వీడారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ఆయన మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసినా.. ఫలించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్లకే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన తాత గుత్తా వెంట్ రెడ్డి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించిన అమిత్.. గత కొంత కాలంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి పట్టు సాధించారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ అడుగుపెట్టాలని భావించారు. కానీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు.


ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ స్థానం నుంచి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాట వల్లే పార్టీ ఓడిందన్నారు. కొందరు నేతల తీరు కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ నేతలు అపాయింట్‌మెంట్ ఇవ్వటం మానేశారన్నారు. అర్థం లేని రాజకీయాలే బీఆర్ఎస్‌ను కొంపముంచాయని, బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారైందంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.


గుత్తా చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఆయన కామెంట్లపై ఇంకా చర్చ జరుగుతుండానే.. తాజాగా తనయుడు అమిత్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి పరిస్థితి ఏంటి అనేది పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశమైంది. ఆయన కూడా తనయుడి బాటలోనే కాంగ్రెస్ పార్టీలే చేరుతారా.. ? లేక కాంగ్రెస్ గూటికి చేరుకుంటారా ? అనేది వేచి చూడాలి మరి.



Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM