byసూర్య | Wed, Apr 17, 2024, 01:38 PM
సివిల్స్ ఫలితాలలో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం మొత్తం 6 గురికి రాగా అనన్యరెడ్డి (దేవరకద్ర) జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అక్షయ దీపక్ (మహబూబ్ నగర్)కు 196వ ర్యాంకు, ఎహతేదా ముపసిర్(ఆత్మకూర్)కు 278వ ర్యాంకు, యశ్వంత్ నాయక్(వెల్దండ- పోచమ్మగడ్డ తండా) 627వ ర్యాంక్, అనుప్రియ (బాలానగర్-తిరుమలగిరి) 914వ ర్యాంక్, శశికాంత్ (జడ్చర్ల- చాకలిగడ్డ తండా) 891వ ర్యాంకు సాధించి సత్తా చాటారు.