byసూర్య | Tue, Apr 30, 2024, 01:21 PM
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా 'పాలిసెట్' మే 24 న నిర్వహించనున్నట్లు మంగళవారం వనపర్తి జిల్లా కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా. చంద్రశేఖర్ తెలిపారు. రూ. 100 ఆలస్య రుసుంతో ఈ రోజు వరకు, రూ. 300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు https: //polycet. sbtet. telangan. gov. in చూడాలన్నారు.