byసూర్య | Tue, May 21, 2024, 10:41 AM
నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో శ్రీ భూలక్ష్మి జాతర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భూలక్ష్మి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కుస్తీ పోటీలు హోరా హోరీగా కొనసాగాయి. కుస్తీ పోటీలలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో మల్ల యోధులు పాల్గొన్నారు. మల్లయోధుల స్థాయిలను బట్టి రూ. 500 నుంచి రూ. 1000 వరకు నగదుతో పాటు, వెండి కడియాలు విజేతలకు గ్రామ ప్రజలు బహుమతులుగా ప్రధానం చేశారు.