byసూర్య | Tue, Apr 30, 2024, 01:17 PM
జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి, తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రుణం తీర్చుకోవాలని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.