byసూర్య | Tue, Apr 30, 2024, 01:13 PM
దేశ భద్రత, అభివృద్ధి ప్రధాని నరేంద్రమోదీ తోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఎంపీగా డీకే అరుణ ను గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని అన్నారు. ఫ్లోర్ లీడర్ రఘుపాల్ రెడ్డి పాల్గొన్నారు.