byసూర్య | Tue, Apr 30, 2024, 01:25 PM
దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు పిలుపునిచ్చారు మంగళవారం మద్యాహ్నం నాగర్ కర్నూల్ సిపిఎం పార్టీ కార్యాలయంలో బిజెపి బందిఖానా నుండి దేశాన్ని విముక్తి చేద్దాం అనే బుక్ లెట్ ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.