byసూర్య | Tue, Apr 30, 2024, 01:49 PM
హుజూర్ నగర్ ఎక్సైజ్ శాఖపరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు విస్తృత దాడులు నిర్వహించి 9 వాహనాలను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ నాగార్జునరెడ్డి సోమవారం తెలిపారు. వివిధ కేసుల్లో ఉన్న 15 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు వివరించారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు జగన్మోహన్రెడ్డి, దివ్య, వెన్నెల, గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.