byసూర్య | Wed, Apr 17, 2024, 12:10 PM
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడీలో మరో భద్రాద్రిగా పేరుగాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వారి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం మరి కొద్దిసేపట్లో నిర్వహించనున్న ఈ కల్యాణ మహోత్సవం కు శ్రీ సీతారామచంద్రులని నూతన పట్టు వస్త్రాలతో ఆభరణాలతో పూలమాలలతో ప్రత్యేకంగా అర్చకులు అలంకరించారు. వారి అలంకరణని చూడడానికి రెండు కనులు చాలవు అన్నట్లుగా ఉందని భక్తులు తెలిపారు.