byసూర్య | Tue, Apr 16, 2024, 10:23 PM
ఈ నెల 18న పలువురు కేంద్రమంత్రులు రాష్ట్రానికి వస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో పాటు కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్దీప్ సింగ్ పూరీ గురువారం హైదరాబాద్ రానున్నారు.గోవా ముఖ్యమంత్రి సావంత్ మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి ప్రచారం చేయనున్నారు.