byసూర్య | Wed, Apr 17, 2024, 10:11 AM
మహారాష్ట్రలోని బిలోలి సెషన్ కోర్టులో బాబ్లీ కేసు విచారణకు మంగళవారం పెద్దపల్లి, కరీంనగర్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, కెఎస్ రత్నం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు అప్పటి ప్రభుత్వం తమపై లాఠీ ఛార్జి చేయడంతోపాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందన్నారు.