కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి ఖరారు.. మాజీ మహిళా మంత్రి కుమారుడికి ఛాన్స్

byసూర్య | Tue, Apr 16, 2024, 07:30 PM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిని అదిష్ఠానం ఫైనల్ చేసింది. ఈ స్థానం నుంచి డాక్టర్ టీఎన్ వంశా తిలక్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు ఈసీ షెడ్యూలు విడదల చేయటంతో పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.


మెుదటగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థిగా ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదితకు ఛాన్స్ ఇచ్చారు గులాబీ బాస్ కె. చంద్రశేఖర్ రావు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశీ తిలక్ పేరును ఖరారు చేశారు. ఈ సీటు కోసం చాలా మంది బీజేపీ నేతలు ఆశలు పెట్టుకోగా.. చివరకు తిలక్ పేరును ఫైనల్ చేశారు.


తొలితరం రాజకీయ నేత, మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి కుమారుడే ఈ తిలక్. ఆమె సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన వారు. 1957లో తొలిసారిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలి దళిత దేవాదాయ మంత్రిగా సేవలందించారు. 1969లో తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరి కొన్నేళ్ల పాటు కొనసాగారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి 2000లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2004లో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఈమె కుమారుడు తిలక్ గత కొంతకాలంగా బీజేపీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.



Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM