byసూర్య | Tue, Apr 16, 2024, 06:36 PM
అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి నాడు దళిత ఎంపీటీసీ గణేష్ పై దాడి నిమిత్తం అడ్డాకుల పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయింది. మంగళవారం బలిదుపల్లి గ్రామంలో సాక్షులు తో డీఎస్పి వేంకటేశ్వరులు నేరుగా మాట్లాడారు. కులం పేరుతో దూషించినందుకు వారికి తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపారు. ఆయన వెంట అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్, రైటర్ శంకర్ నాయక్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.