byసూర్య | Tue, Apr 16, 2024, 06:34 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని సంకాపురం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 22 వ్యవసాయ మోటార్లకు సంబంధించిన పరికరాలు కాలి బూడిదయ్యయి. గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద రైతులు మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. 22 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్ల పరికరాలైన స్టార్టర్లు, పైపులు తదితరాలు కాలిపోయాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.