byసూర్య | Tue, Apr 16, 2024, 06:31 PM
ప్రజలు శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 69 చోట్ల శ్రీరామ నవమి పురస్కరించుకొని స్వామి వారి కళ్యాణాలు, రథోత్సవాలు, శోభాయాత్రలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయా ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని చెప్పారు. పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.