byసూర్య | Tue, Apr 16, 2024, 06:26 PM
తెలుగు రాష్ట్రాల సివిల్స్ విజేతలకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 మందికి పైగా ఎంపికవటంతో సీఎం సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామనికి చెందిన దోనూరు సురేష్ రెడ్డి కూతురు దోనూరు అనన్యరెడ్డికి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాలమూరు బిడ్డ మూడో ర్యాంకు సాధించడంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు.