byసూర్య | Tue, Apr 16, 2024, 06:20 PM
ముదిరాజ్ లను బిసి డి గ్రూప్ నుండి బిసి ఏ గ్రూపులోకి మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో మంగళవారం నారాయణపేట పట్టణంలో సీఎం చిత్రపటానికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా సరాఫ్ నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని జనగర్జన సభ సాక్షిగా ప్రకటించారని అన్నారు.