byసూర్య | Tue, Apr 16, 2024, 06:05 PM
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం నారాయణపేట బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కార్యకర్తలు, నాయకుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.