byసూర్య | Tue, Apr 16, 2024, 06:04 PM
నాగర్ కర్నూల్ పరిసర ప్రాంతాలలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి న్యాయమూర్తి రామయ్య ఒకరోజు జైలు శిక్షతోపాటు 2500 జరిమానా, బస్టాండు దగ్గర అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఒకరిపై షీ టీం వాళ్ళ కంప్లైంట్ మేరకు మంగళవారం కేస్ పెట్టి జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాహన దారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరికలు జారీ చేశారు.