byసూర్య | Fri, Apr 12, 2024, 05:01 PM
ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామంలోని సాయి కృష్ణ రైస్ మిల్లు యజమాని రాజేందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రభుత్వానికి అందజేయాల్సిన 1. 8 కోట్ల రూపాయల విలువ గల సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టించినట్లు ఇటీవల జరిపిన తనిఖీల్లో గుర్తించినట్లు కలెక్టర్ చెప్పారు. సివిల్ సప్లై డిఎం దేవదాస్ చేత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించగా, ఆయనపై కేసు నమోదు అయినట్లు చెప్పారు.