byసూర్య | Fri, Apr 12, 2024, 05:05 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం పరిధిలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని కోరారు.