byసూర్య | Fri, Apr 12, 2024, 04:52 PM
కొల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం రాజా గారి బంగ్లా ముందు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్ ) ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఏఐకేఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకెఎస్ రాష్ట్ర నాయకులు బాల పీరు మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న వలస పాలనకు భూస్వామ్య పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు రైతు సంఘం నిర్వహించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.