byసూర్య | Fri, Apr 12, 2024, 04:51 PM
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బూత్ స్థాయి సమ్మేళనం శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి సమీపంలోని బృందావన్ గార్డెన్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనముకు కౌకుంట్ల మండల కేంద్రం నుండి బీజేపీ నాయకులు బయలుదేరారు. పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ స్థాయిపై నాయకులు పాల్గొన్నారు.