byసూర్య | Fri, Apr 12, 2024, 03:18 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలం పరిధిలోగల ఊరేళ్ల గ్రామంలో స్థానికుల ఆధ్వర్యంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కన్నుల పండువగ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపి సిసి క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం, టిపిసిసి జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.