byసూర్య | Fri, Apr 12, 2024, 03:00 PM
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో శుక్రవారం శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శ్రీకోదండ రామాలయంలో, పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ.. శ్రీరామ నవమి పండగ సందర్భంగా ముందస్తుగా శ్రీకోదండ రామాలయం లో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. పండుగ రోజు ఆలయ పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు.