byసూర్య | Fri, Apr 12, 2024, 02:10 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ బస్తీలకు చెందిన ప్రజలు మాజీ ఎమ్మెల్యే ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులు వివిధ కాలనీకి చెందిన ప్రజలు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి స్థానికంగా ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.