byసూర్య | Fri, Apr 12, 2024, 02:06 PM
ప్రజల సేవకుడిగా ఉన్న తనను ఆదరించి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం మార్నింగ్ వాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మార్నింగ్ వాక్ పాల్గొని, సుల్తానాబాద్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష, నాయకులు పాల్గొన్నారు.