byసూర్య | Fri, Apr 12, 2024, 03:57 PM
నిషేధిత నల్లమందు విక్రయిస్తున్న వ్యక్తి ని గురువారం మీర్ పేట్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. రాజస్థాన్ కు చెందిన అగ్రీవత్ సంతోశ్ దాస్, బుద్దారామ్ స్నేహితులు. ప్రశాంత్ నగర్ లో నివసిస్తూ కార్పెంటర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లమందును తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో విక్రయించాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి అగ్రీవత్ సంతో శ్రీసును అదుపులోకి తీసుకున్నారు.