byసూర్య | Wed, Apr 10, 2024, 04:06 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నరసాపూర్ లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి వారి శావా వూరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.