byసూర్య | Wed, Apr 10, 2024, 04:05 PM
రామగిరి మండలం రత్నపూర్, బేగంపేట, ముస్తాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిడిఓ శైలజ రాణి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని, మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం స్వరూప రాణి, సిసిలు శంకర్, రమేష్, శోభారాణి, కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.