byసూర్య | Fri, Mar 29, 2024, 08:19 PM
ఖమ్మం 4వ డివిజన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా కైకొండాయిగూడెం రోడ్లో కొలువైన శ్రీశ్రీశ్రీ అంకమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ మద్దిరావమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లు, నాగేంద్రస్వామి దేవాలయం పునః ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా నగర మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రతిష్ట విగ్రహాలకు క్షీరాభిషేకం మేయర్ చేతుల మీదుగా నిర్వహించారు.