పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని విషం తాగి ప్రేమికులు ఆత్మహత్య

byసూర్య | Sun, Apr 28, 2024, 07:58 PM

తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో జీవితంలో ఇక కలిసుండటం కుదరదని భావించిన ప్రేమికులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి చావాలని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషాదకర ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని శనివారం రాత్రి చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని తుమ్మల పెన్ పహడ్ గ్రామానికి చెందిన గుండా గాని సంజయ్ (26), చల్లగుండ నాగజ్యోతి (24) ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం అలమకుంది.


పెన్ పహడ్ గ్రామానికి చెందిన గుండ గాని సంజయ్, చల్లగుండ నాగజ్యోతి‌లులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి కులాలు వేరు కావడంతో ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ప్రేమికుల పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డుపడ్డారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ప్రేమికులుతీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో కలిసి చావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. తుమ్మల పెన్ పహడ్ గ్రామానికి చేరుకున్నారు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.


Latest News
 

25 రోజుల్లో 10 వేల కేసులు నమోదు.. 320 కోట్ల సొత్తు స్వాధీనం Sun, May 12, 2024, 07:34 PM
తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఈ 10 రోజులు నో టెన్షన్ Sun, May 12, 2024, 07:31 PM
ఓటర్ల వేలికి పడే 'సిరా చుక్క' తయారయ్యేది హైదరాబాద్‌లోనే.. 37 ఏళ్లుగా తయారీ, 100 దేశాలకు ఎగుమతి..! Sun, May 12, 2024, 07:27 PM
తెలంగాణ ఎన్నికలు.. ఇప్పటి వరకు సీజ్ చేసిన సొత్తు విలువ ఎన్ని కోట్లో తెలుసా Sun, May 12, 2024, 07:23 PM
ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. డిక్కీలో కనిపించిన 2 బ్యాగులు.. ఏంటని తెరిచి చూస్తే మైండ్ బ్లాక్..! Sun, May 12, 2024, 06:16 PM