byసూర్య | Fri, Mar 29, 2024, 02:37 PM
విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని మండల విద్యాధికారి ఎల్లయ్య ఆదేశించారు. గురువారం భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను ఆయన పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని తెలిపారు.