byసూర్య | Mon, Apr 29, 2024, 01:32 PM
ఓదెల మండలం గుంపుల గ్రామంలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ రెడ్డి, ఆళ్ల సుమన్ రెడ్డి, నాయకులు సందె మహేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.