byసూర్య | Mon, Apr 29, 2024, 01:43 PM
లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మధ్యప్రదేశ్ కు చెందిన లాల్ దాస్ కొంరె అనే వలస కూలీ మృతి చెందాడు. మృతుడు అయిదు రోజుల క్రితం మరో నలుగురు కూలీలతో కలిసి పనికోసం వచ్చాడు. స్థానికంగా మామిడి కాయల మండీలో ఒకరోజు పని చేశారు. కూలి డబ్బులు తీసుకుని తిరిగి తమ రాష్ట్రానికి వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళాడు. రెండు రోజుల తర్వాత బావిలో శవమై కనిపించినట్లు ఎస్సై చంద్రకుమార్ ఆదివారం తెలిపారు.