byసూర్య | Mon, Apr 29, 2024, 01:41 PM
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, నిట్టూరు, తుర్కల మద్దికుంట, కాసులపల్లి, పాలితం, గోపయ్యపల్లి గ్రామాల్లో సోమవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలను కలిసి మే 13న హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.