byసూర్య | Fri, Mar 01, 2024, 01:56 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20, 800 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7, 650 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.
మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు. కాగా, నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ. 300 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ. 50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.