byసూర్య | Fri, Mar 01, 2024, 01:54 PM
2022-23 సంవత్సరం వరకూ బకాయి ఉన్న ఆస్తి పన్నులపై విధించిన మొత్తం వడ్డీపై 90శాతం రాయితీ ఇస్తున్నట్లు ఖమ్మం నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బకాయి ఉన్న పూర్తి ఇంటిపన్ను చెల్లించిన వారికే వడ్డీరాయితీ ఉంటుందన్నారు.
వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మార్చి 31 వరకు బకాయిలు చెల్లించి, వడ్డీపై 90శాతం రాయితీ పొందవచ్చని, ఆస్తిపన్నుల బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.