byసూర్య | Fri, Mar 01, 2024, 01:53 PM
వ్యవస్తీకృత నేరాల నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని సీపీ సునిల్ దత్ అన్నారు. ప్రతినెలా నిర్వహించే నేరసమీక్షా సమావేశంలో భాగంగా గురువారం ఖమ్మం పోలీసు కాన్ఫరెన్సు హాల్లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో విధిగా విజుబుల్ పోలీసింగ్ అమలు చేయాలని తద్వారా నేరాలు నియంత్రణలో ఉంటాయన్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని సూచించారు.