byసూర్య | Fri, Mar 01, 2024, 01:50 PM
కేసీఆర్ కు పొలిటికల్ ఫిట్ మెంట్ ఇచ్చిన బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేశారని, ఆంధ్రా పాలకులు కృష్ణా జలాలను దోచుకుంటున్నా కేసీఆర్ తాతయ్యలా చూస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి విమర్శించారు.
ఈ సందర్భంగా శుక్రవారం మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడారు. కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ కు నీళ్లు తీసుకెళ్తున్న ఆంధ్రా నేతలను కేసీఆర్ అడ్డుకోలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి తొమ్మిదేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టు మొత్తం నాసిరకం పనులు జరుగుతున్నాయని, దక్షిణ తెలంగాణపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించారని విమర్శించారు.