byసూర్య | Fri, Mar 01, 2024, 01:57 PM
ఖమ్మం నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం, గురువారాల్లో రెవెన్యూమేళాలు నిర్వహించనున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ రెవెన్యూ మేళాలో ఇంటిపన్నుల హెచ్చుతగ్గులు, పంపు పన్నుల పేరు మార్పులు, చేర్పులు, ఇంటినెంబరు సవరణ తదితర అంశాలపై దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ మేళాలో వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.