ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో కీలక మలుపు

byసూర్య | Fri, Mar 01, 2024, 01:08 PM

కంటోన్మెంట్ భరస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన లాస్య అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, ఆమె ప్రయాణిస్తున్న కారు మొదట టిప్పర్‌ను ఢీకొట్టి, ఆపై రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కారును టిప్పర్ ఢీకొట్టిందా లేక వెనుక నుంచి కారు టిప్పర్‌ను ఢీకొట్టి ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM