byసూర్య | Fri, Mar 01, 2024, 01:11 PM
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఉదయం దిగువ గోదావరిలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు SRSP డీఈ గణేష్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఏడాది కూడా తాగునీటి అవసరాల కోసం బాబ్లీ దిగువనున్న ఎస్సారెస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు.