byసూర్య | Fri, Mar 01, 2024, 01:03 PM
చలో మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైరు ఒక్కసారిగా పగిలిపోయింది. దారిలో బస్సు ఆగింది. ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ ఘటన జనగాం సమీపంలో చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న మెకానిక్ను పిలిపించిన నేతలు సమీపంలోని టైరును మారుస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు.