byసూర్య | Fri, Mar 01, 2024, 12:55 PM
కంది మండల పరిధిలోని ఐఐటి సమీపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరు రూపేష్ గురువారం పరిశీలించారు. మార్చి 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారని వారు తెలిపారు. బిజెపి నేతలతో మాట్లాడి ప్రధాని సభ కోసం చేయాల్సిన ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. ఒక వారి వెంట మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు.