byసూర్య | Fri, Mar 01, 2024, 12:54 PM
నస్పూర్ మున్సిపాలిటీలో 2022- 23 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు కమిషనర్ సతీష్ శుక్రవారం తెలిపారు. వాణిజ్య, నివాస గృహాల యజమానులు మార్చి 31 లోపు ఆస్తి పన్ను చెల్లించి 90 శాతం వడ్డీ మాఫీని పొందాలని సూచించారు. పట్టణంలోని గృహ యజమానులు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.