byసూర్య | Fri, Mar 01, 2024, 12:21 PM
విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న 553 JLM పోస్టులు ఇప్పటికే పరీక్షల్లో అర్హత సాధించిన వారితో భర్తీ చేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్ ను ఆదేశించింది. 2019లో JLM నోటిఫికేషన్ విడుదల కాగా టీఎస్ఎస్పీడీసీఎల్ నిబంధనలతో తాము నష్టపోయామని కొందరు కోర్టును ఆశ్రయించారు. పోస్టులకు రాష్ట్రపతి ఉత్వర్వులు, స్థానికత లాంటి అంశాలు వర్తించవని స్పష్టం చేసింది.