byసూర్య | Tue, Dec 05, 2023, 10:21 AM
తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం అక్టోబర్ నెలలో నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి విడుదల చేశారని హన్మకొండ డిఈఓ అబ్దుల్ హై సోమవారం తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు అప్లై చేసుకోవాలని కోరారు. ఈనెల 7వ తేదీ నుంచి 16 వరకు మీసేవా కేంద్రాల్లో ఫీజులు చెల్లించాలన్నారు. పరీక్ష ఫలితాలను వెబ్ సైట్ www. telanganaopenschool. org లో తెలుసుకోవాలన్నారు.